చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు స్వర్ణం

63చూసినవారు
చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు స్వర్ణం
చెస్ ఒలింపియాడ్‌లో భారత్ తొలిసారి స్వర్ణం గెలిచి రికార్డు సృష్టించింది. 45వ FIDE చెస్ ఒలింపియాడ్ సెప్టెంబర్ 10న హంగేరిలోని బుడాపెస్ట్‌లో ప్రారంభమైంది. ఈ పోటీల్లో భారత్ అత్యధిక పాయింట్లతో స్వర్ణం సాధించింది. భారత బృందంలోని పెంటేల హరికృష్ణ, గుకేష్, ప్రజ్ఞానంద, అర్జున్ ఎరికైసి, శ్రీనాథ్ నారాయణన్‌లపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక చెస్ ఒలింపియాడ్‌లో 2014, 2022లలో భారత్ కాంస్యం గెలుచుకుంది.

సంబంధిత పోస్ట్