అస్సాంలోని కాజిరంగా నేషనల్ పార్క్లో అరుదైన గోల్డెన్ టైగర్ ఉన్న విషయం తెలిసిందే. ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మయూరేశ్ హెంద్రే ఈ పులి కదలికలను తన కెమెరాలో బంధించాడు. దాంతో లేటెస్ట్గా ఈ గోల్డెన్ టైగర్ వెలుగులోకి వచ్చింది. నేషనల్ టూరిజమ్ డే సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ గోల్డెన్ టైగర్ ఫోటో, వీడియోను నెట్టింట షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.