బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆస్పత్రి 24వ వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. 'చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం నాకు వచ్చింది. చంద్రబాబు 18 గంటలు పనిచేసి, నేను 12 గంటలు పనిచేస్తే సరిపోదు. రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పనిచేయాల్సిందే. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీపడాలి. హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం' అని అన్నారు.