తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. డిచ్పల్లి తెలంగాణ వర్సిటీ బాలికల వసతి గృహంలో బాలికలకు పెట్టిన అల్పాహారంలో బల్లి కనిపించింది. నిన్న ఈ ఘటన జరగ్గా, విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని బయటకు రాకుండా అధికారులు గోప్యంగా ఉంచారు. కాగా, ఈ ఘటనపై చివరికి స్పందించిన అధికారులు సదరు వంట మనిషిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.