టీ20 ప్రపంచకప్ సూపర్-8 పోరులో భాగంగా ఇవాళ రాత్రి 8 గంటలకు ఆటింగ్వా వేదిక భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి చిన్నపాటి వర్షం పడొచ్చని ఆటింగ్వాలోని వాతావరణ కేంద్రం చెబుతోంది. మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే పరిస్థితి ఉండదని పేర్కొంది. బంగ్లాతో మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్ సెమీస్కు చేరుకోవడం దాదాపు ఖాయమవుతుంది.