తమిళనాడు రాజధాని చెన్నైలో పశువుల పెంపకంపై నిషేధం అమలు చేసేలా కొత్త చట్టం రూపొందించాలని కోరుతూ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇటీవల తిరువొత్తియూరు తదితర ప్రాంతాల్లో గేదెలు, ఎద్దులు, రహదారిపై వెళ్తున్న పాదచారులను ఢీకొట్టి గాయపరిచాయి. ఓ గేదె మహిళను కొమ్ములతో పొడిచి ఆమెను 50 అడుగుల దూరం వరకూ లాక్కెళ్లి పడేసింది. దీంతో కొత్త చట్టం తీసుకురావాలని కార్పొరేషన్ అధికారులు కోరారు.