నీట్ పేపర్ లీక్ వ్యవహారం, అదే సమయంలో యూజీసీ నెట్ పరీక్ష రద్దు కావడం వంటి పరిణామాలు దేశంలో కలకలం సృష్టిస్తున్నాయి. నెట్ పరీక్షా పత్రం లీక్ కాగానే ఎన్క్రిప్టెడ్ సోషల్మీడియా ప్లాట్ఫాంలలో అమ్మకానికి ఉంచారని సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీనిపై ఓ సోషల్మీడియా ప్లాట్ఫామైన టెలిగ్రాం స్పందించింది. పేపర్ లీక్తో ప్రమేయం ఉన్న ఛానెళ్లపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.