ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద చిత్తశుద్ధి లేదని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. '422 జూనియర్ కాలేజీల్లో లక్షా 60 వేల మంది పేద, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. జూనియర్ కాలేజీల్లో విధులు నిర్వర్తించే 1,654 గెస్ట్ ఫ్యాకల్టీని రెన్యువల్ చేయాలి' అని బుధవారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.