కొన్ని నెలల్లో ఎన్నికలు వస్తున్న వేళ పాల ఉత్పత్తిదారులకు మహారాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 1 వ తేదీ నుంచి పాల ఉత్పత్తిదారులు పోసే పాలకు లీటర్కు రూ.5 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. క్రూర జంతువుల దాడిలో చనిపోయిన వారికి గతంలో మహారాష్ట్రలో రూ.20 లక్షలు పరిహారం ప్రకటించేది. ఈ మొత్తాన్ని 25 లక్షలకు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో అజిత్ పవార్ స్పష్టం చేశారు.