విద్యుత్ షాక్ తో అమ్మమ్మ.. మనవడు మృతి

67చూసినవారు
విద్యుత్ షాక్ తో అమ్మమ్మ.. మనవడు మృతి
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామంలో దారుణం జరిగింది. చిట్యాల మండలం వెంకట్రావుపల్లి(సీ)కి చెందిన ముడతనపల్లి రామలక్ష్మి (60) భర్త మరణించడంతో ఆమె పెద్ద కుమార్తె రమ వద్ద ఉంటోంది. ఇంటి ఆవరణలో ఆరేసిన దుస్తులు తీయడానికి వెళ్లిన రామలక్ష్మి దండేన్ని తాకగానే విద్యుత్ షాక్ కు గురైంది. గమనించిన రమ కుమారుడు సాయిచరణ్(15) అమ్మమ్మను కాపాడేందుకు ప్రయత్నించగా షాక్ కు గురై ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

సంబంధిత పోస్ట్