టీ20 వరల్డ్ కప్ కోసం మరో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు న్యూయార్క్కు బయల్దేరారు. ఇప్పటికే మొదటి బ్యాచ్ అక్కడికి చేరుకోగా, రెండో బ్యాచ్లో జైశ్వాల్, చాహల్, అవేశ్ పయనమయ్యారు. తొలి బ్యాచ్లో రోహిత్, గిల్, బుమ్రా, జడేజా, పంత్, సూర్య, దూబే, ఖలీల్, అక్షర్, అర్ష్దీప్, సిరాజ్, కుల్దీప్, కోచింగ్ స్టాఫ్ వెళ్లారు. హార్దిక్ కూడా తాజాగా జట్టులో చేరారు. కోహ్లీ, శాంసన్, రింకూ సింగ్ నెక్ట్స్ బ్యాచ్లో వెళ్లే ఛాన్సుంది.