తెలంగాణలో మరో నాలుగు డయాగ్నోస్టిక్ హబ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే 31 హబ్లు ఉండగా, కొత్తగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, ములుగు జిల్లా ఏటూరునాగారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, నాగర్కర్నూల్ జిల్లా మన్ననూర్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేటి నుంచి అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.