ప్రభుత్వ విభాగాల్లో 563 గ్రూప్-1 సర్వీసు పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ జారీచేసిన ఉద్యోగ ప్రకటన దరఖాస్తు గడువు గురువారంతో ముగియనుంది. ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న కమిషన్.. ఈనెల 14 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. బుధవారం వరకు 2.70 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది. గతంలోనూ చివరిరోజున భారీ సంఖ్యలో దరఖాస్తు చేశారు. ఈసారి కూడా అలాగే జరగవచ్చని టీఎస్పీఎస్సీ అంచనా వేస్తోంది.