గిరిజన మహిళను పరామర్శించిన హరీష్‌రావు, సబితా

50చూసినవారు
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఇవాళ వెళ్లారు. గత 9 నెలల్లో మహిళలపై 1900లకుపైగా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయని హరీష్ రావు, సబితా అన్నారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మహిళలపై హత్యాచారాలు జరుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి స్పందించడానికి తీరిక కూడా లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్