భార్యపై అనుమానంతో గొంతు కోసి హత్య చేసిన భర్త

65చూసినవారు
భార్యపై అనుమానంతో గొంతు కోసి హత్య చేసిన భర్త
ఏపీలోని తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. తిరుచానూరుకు చెందిన రూపావతి, రమేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు. భార్యపై అనుమానం పెంచుకున్న రమేష్ తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి రమేశ్ మద్యం సేవించి ఇంటికి రావడంతో, భార్యభర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన రమేశ్.. తన భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్