హైదరాబాద్‌ చేరుకున్న దీప్తి జివాంజీ.. ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం (Video)

80చూసినవారు
ప్రతిష్ఠాత్మక పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత యువ అథ్లెట్‌ జివాంజీ దీప్తి సత్తాచాటిన విషయం తెలిసిందే. మహిళల 400 మీటర్ల టీ20 రేసులో కాంస్య పతకం గెలుచుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన రేసులో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ తెలంగాణ అమ్మాయి అరంగేట్రం పారాలింపిక్స్‌లో తొలి పతకాన్ని ముద్దాడి ఔరా అనిపించింది. తాజాగా దీప్తి ఇవాళ ఉదయం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యింది. ఈ సందర్భంగా దీప్తికి ఘన స్వాగతం లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్