సీఎం రేవంత్రెడ్డి నిన్నటి మీడియా సమావేశంలో వితండవాదం తప్ప మరేమి లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సీఎం రేవంత్ భాష, ధోరణి చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. 2 నెలల్లో సీఎం ప్రాజెక్టులను దిల్లీ చేతిలో పెట్టారని అన్నారు. అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలను నడపడం సరికాదని సూచించారు.