కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే అనుమానాలున్న వినియోగదారుల కోసం దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ ఓ సదుపాయాన్ని తీసుకొచ్చింది. వెబ్సైట్లో విద్యుత్ ఛార్జీలను తెలుసుకునేందుకు వీలుగా 'ఎనర్జీ ఛార్జెస్ కాలిక్యులేటర్ ఫర్ డొమెస్టిక్ సర్వీసెస్' అనే సర్వీసును ప్రారంభించింది. దీని కోసం రీడింగ్ తేదీలు, యూనిట్ల వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉత్తర డిస్కం వినియోగదారులు కూడా దీనిని వినియోగించుకోవచ్చు. SHARE IT>>