ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో సత్సంగ్ ప్రాంగణం వద్ద మంగళవారం మధ్యాహ్నం తొక్కిసలాట జరిగింది. అయితే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్న భోలే బాబా పరారీలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ బాబా కోసం వెతుకులాట ప్రారంభించారు. బాబా నడిచిన ప్రదేశంలోని మట్టిని తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అనుచరులు ఎగబడ్డారు. ఆ సమయంలోనే తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. అక్కడ సుమారు రెండున్నర లక్షల మంది హాజరైనట్లు తెలుస్తోంది.