లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం తర్వాత ఆయనను బీజేపీ ఆపడం సాధ్యం కాదని శివసేన (UBT) బుధవారం పేర్కొంది. పార్టీ పత్రిక సామ్నాలో రాహుల్ను ప్రశంసించింది. 'గత పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. మోడీ దివ్యత్వాన్ని రాహుల్ తొలగించారు. ప్రతిపక్ష నాయకుడిని అభినందించకుండా ఉండలేం' అని ‘సామ్నా’ పేర్కొంది.