యూపీలోని హత్రాస్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 121 మంది మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో పోలీసులు చర్యలు చేపట్టి 20 మందిని అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు విచారిస్తున్నారు. హత్రాస్ పోలీసులు 7 బృందాలను ఏర్పాటు చేశారు. చీఫ్ సేవాదార్ దేవ్ప్రకాష్ మధుకర్ కోసం ఈ బృందాలు శోధిస్తున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు బుధవారం హోం శాఖ.. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది.