ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ఇటీవల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో స్వాతి సంచలన ఆరోపణలు చేసింది. బిభవ్ కుమార్ తన సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఆరోపించారు. 7-8 సార్లు చెంపదెబ్బలు కొట్టి, పొత్తికడుపుపై తన్నాడని పేర్కొన్నారు.