ఉత్తరప్రదేశ్లోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వరదల కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందలాది రైతుల ఈ అకాల వర్షాల వల్ల భారీగా నష్టపోయారు. వందలాది పంట పొలాలు నీటమునిగాయి. అలాగే రోడ్లు కూడా చెరువులను తలిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముజఫర్నగర్ జిల్లాలోని ఓ రోడ్డు ఒక్కసారిగా ముక్కలు ముక్కలుగా తెగిపోయింది. ఈ ఘటన అక్కడి స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.