అమెరికా ఈశాన్య ప్రాంతంలో తీవ్ర మంచు తుఫాను సంభవించింది. దీంతో చాలా చోట్ల భారీగా హిమపాతం నమోదైంది. ఫలితంగా ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. న్యూయార్క్, మస్సాచుసెట్స్, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు క్లాస్లు నిర్వహిస్తున్నారు. దాదాపు 1200 విమానాలు రద్దయ్యాయి. పెన్సిల్వేనియాలో 1,50,000 కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.