తిరుమలలో భారీగా రద్దీ.. స్వామి దర్శనానికి 24 గంటల సమయం

594చూసినవారు
తిరుమలలో భారీగా రద్దీ.. స్వామి దర్శనానికి 24 గంటల సమయం
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సాధారణ భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. భక్తులు బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలో వేచి ఉన్నారు. కాగా, నిన్న 79,251 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్