రేపు నాంపల్లి కోర్టుకు హీరో నాగార్జున

85చూసినవారు
రేపు నాంపల్లి కోర్టుకు హీరో నాగార్జున
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నాగార్జున వేసిన క్రిమినల్‌ పరువునష్టం దావాపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంలో మంగళవారం నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు పేర్కొంది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్