తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో కూంబింగ్ చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల పలు ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఎన్కౌంటర్లకు నిరసనగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మ, దంతెవాడ జిల్లాల బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.