అనారోగ్యం కారణంగా, చెన్నై అపోలో ఆస్పత్రిలో మాజీ సీఎం జయలలిత చికిత్స పొందిన సమయంలో నెలకొన్న ఘటనలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ అన్నాడీఎంకే సభ్యుడు రామ్కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ మద్రాసు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.