చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) పరీక్షలను వాయిదా వేయాలన్న విద్యార్థుల పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా జూన్లో పరీక్షలు నిర్వహించాలని కొందరు సీఏ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. దీనికి కోర్టు అంగీకరించలేదు. షెడ్యూల్ ప్రకారం మే నెలలో సీఏ పరీక్షలు జరగనున్నాయి.