ఘోరం.. క్షిపణి శకలం పడి యువకుడు మృతి (వీడియో)

65చూసినవారు
క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రత్యక్ష దాడికి దిగింది. ఈ క్రమంలో ఇరాన్ క్షిపణి నుంచి జారిపడిన ఓ శకలం ఓ పాలస్తీనా పౌరుడి ప్రాణం తీసింది. జెరిఖో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమేహ్ అల్-అసాలి (37) అనే వ్యక్తి మీద ఆకాశంలో నుంచి రాకెట్ శకలం పడింది. దీంతో తీవ్ర గాయాలై అల్-అసాలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్