ఘోరం.. నడిరోడ్డుపై కొట్టి చంపారు (వీడియో)

69చూసినవారు
ముంబైలో ఘోర సంఘటన జరిగింది. నడిరోడ్డు మీదే 28 ఏళ్ల యువకుడిని కొట్టి చంపారు. ఆకాష్ మెయిన్ అనే వ్యక్తి అతని భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, శివాజీ చౌక్ సమీపంలో ఓ ఆటో వారి బైక్‌ను స్వల్పంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆకాష్, ఆటో డ్రైవర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆటో డ్రైవర్ మరికొందరిని పిలిచి ఆకాష్‌పై దాడి చేశాడు. వారు తీవ్రంగా కొట్టడంతో ఆకాష్ మరణించాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్