గుజరాత్లోని వడాలిలో ఘోర సంఘటన జరిగింది. ఒక ఇంటికి డెలివరీ చేసిన పార్సిల్ పేలడంతో ఒక వ్యక్తి, అతడి కుమార్తె మరణించారు. జితేంద్ర హీరాభాయ్ వంజారా, ఆయన కుమార్తె భూమిక వంజారా ఈ సంఘటనలో మరణించారు. 9, 10 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆన్లైన్లో ఓ వస్తువును ఆర్డర్ పెట్టగా వచ్చిన పార్సిల్ పేలడంతో ఇద్దరూ మృత్యువాత పడినట్టు పోలీసులు తెలిపారు.