టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామం ఆరంభమైంది. ఈ టోర్నీ ప్రైజ్మనీని తాజాగా
ఐసీసీ ప్రకటించింది. టోర్నీ చరిత్రలోనే ఈ సీజన్కు
ఐసీసీ రికార్డు స్థాయిలో 11.25 మిలియన్ యూఎస్ డాలర్ల ప్రైజ్మనీని ప్రకటించింది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు 2.45 మిలియన్ డాలర్లు, రన్నరప్ టీమ్కు 1.28 మి.డాలర్లు ఇవ్వనున్నారు. మరోవైపు సెమీస్, సూపర్ 8, 9 నుంచి 12వ స్థానం, 13 నుంచి 20వ స్థానం వరకు నిలిచిన జట్లకు ప్రైజ్ మనీ ఉంది.