ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకుల మోత మోగింది. తూటాల వర్షంతో ఛత్తీస్గఢ్ అడవులు దద్దరిల్లాయి. మావోయిస్టులు, జవాన్ల మధ్య మంగళవారం భీకర ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. చత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా చోటేబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలో రాష్ట్ర పోలీసులు (డీఆర్జీ), కేంద్ర భద్రతా బలగాల జాయింట్ ఆపరేషన్ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారని చత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు.