ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి (వీడియో)

56చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా కమారియా ప్రాంతంలో ఉన్న ఆయుధాల ఫ్యాక్టరీలో ఘోర పేలుడు సంభవించింది. ఇంధనం నింపే స్టేషన్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అలాగే, ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్