గల్ఫ్ దేశం కువైట్లో ఈనెల 12న భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 50 మంది మరణించగా.. అందులో 40 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 45 మంది గాయపడ్డారని కువైట్ అధికారులు తెలిపారు. మృతుల్లో కేరళకు చెందినవారు 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ల నుంచి ముగ్గురు చొప్పున, ఒడిశా నుంచి ఇద్దరు, బిహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, హరియాణాల నుంచి ఒక్కరేసి ఉన్నారు.