‘ఎన్విడియా' కంప్యూటర్ చిప్ తయారీ కంపెనీ మార్కెట్ విలువ భారీగా పెరిగింది. ఈ మేరకు 3లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారు రూ.250 లక్షల కోట్లకు చేరింది. ఈ స్థాయి ఘనత సాధించిన తొలి చిప్ తయారీ కంపెనీ ఇదే. ఈ సంస్థ అధిపతి జెన్సెన్ హువాంగ్ ప్రపంచ కుబేరుల జాబితాలో 13వ స్థానానికి చేరుకున్నారు. ఈ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు అవసరమయ్యే చిప్ లను తయారు చేస్తుంది.