ఈ ఆలయాలకు ఏడాదికి వందల కోట్ల విరాళాలు.!

74చూసినవారు
ఈ ఆలయాలకు ఏడాదికి వందల కోట్ల విరాళాలు.!
భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయంగా చెప్పవచ్చు. మన దేశంలో వందల కోట్లు విరాళాలు పొందే ఆలయాల గురించి తెలుసుకుందాం.! తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు ప్రతి ఏడాది వివిధ రూపాల్లో సుమారు రూ.600 కోట్ల మేర విరాళంగా అందజేస్తారు. పద్మనాభ స్వామి దేవాలయం మన దేశంలో అత్యంత ధనిక దేవాలయం. ఏటా భక్తుల నుండి దాదాపు రూ.500 కోట్ల విలువైన కానుకలు వస్తాయి. మహారాష్ట్రలోని షిర్డీలో షిర్డీ సాయిబాబా ఆలయానికి ఏటా దాదాపు రూ.400 కోట్ల విలువైన విరాళాలు వస్తుంటాయి. జమ్మూ కాశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయానికి సంవత్సరానికి రూ. 500 కోట్ల కానుకలు అందుతాయి. ముంబైలో సిద్ధివినాయక దేవాలయానికి ప్రతి సంవత్సరం సుమారు రూ.125 కోట్ల విలువైన కానుకలు అందుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్