పాలు విరిగాయని భార్యను దారుణంగా కొట్టిన భర్త (వీడియో)

55చూసినవారు
హైదరాబాద్ మధురానగర్ ఎల్లారెడ్డి గూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాలు విరిగాయని భార్యను భర్త చావబాదాడు. అదనపు కట్నం కోసం వేధిస్తూ మూడురోజుల పాటు గదిలో బంధించి పైశాచికంగా దాడి చేశాడు. చివరకు మీ కుమార్తె చనిపోయిందంటూ తల్లి దండ్రులకు ఫోన్ చేశాడు. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను అమీర్ పేట్ లోని ఓ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్