ముంబై నెట్వర్క్లో ప్లాట్ఫారమ్ విస్తరణ పనుల కోసం సెంట్రల్ రైల్వే ఈ రాత్రి నుంచి 63 గంటల మెగా బ్లాక్ను నిర్వహించనుంది. ఈ చర్య ముంబై లైఫ్ లైన్ అని పిలువబడే లోకల్ రైళ్ల సేవలను.. లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను ప్రభావితం చేస్తుంది. అవసరం లేకుంటే లోకల్ రైళ్లలో ప్రయాణించకుండా ఉండాలని రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.