చెన్నై విమానాశ్రయానికన్నా భిన్నంగా నగరానికి రెండో విమానాశ్రయంగా కాంచీపురం జిల్లా పరందూరు పరిధిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రాబోతోంది. ఈ ప్రాజెక్టును రూ.20 వేల కోట్లతో చేపట్టాలని అంచనా వేస్తున్నారు. టెండర్లు ఆహ్వానించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. ఈ గడువు పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని చూస్తున్నారు. టెర్మినల్కు రెండువైపులా రన్వేలు నిర్మించనున్నారు.