భార్య చూస్తుండగానే చెరువులో మునిగి భర్త మృతి

1100చూసినవారు
భార్య చూస్తుండగానే చెరువులో మునిగి భర్త మృతి
భార్య చూస్తుండగానే చెరువులో మునిగి భర్త మృతి చెందిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బాచుపల్లి పెట్రోల్ బంకు సమీపంలో హన్మంత్, కల్పన దంపతులు నివాసం ఉంటున్నారు. శనివారం వారు భైరుని చెరువుకి వెళ్లారు. కల్పన ఒడ్డున నిల్చోగా.. హన్మంత్ స్నానానికి నీటిలోకి దిగి ఎంతకీ తిరిగి రాలేదు. సాయంత్రానికి చెరువులో మృతదేహం లభ్యమవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్