సమ్మర్లో సామాన్యులకు షాక్ తగలనుంది. నిన్నటి దాకా మార్కెట్లో రూ.20 ఉన్న అరడజను నిమ్మకాయలు.. ఇవాళ ఏకంగా నింగిని తాకాయి. ప్రస్తుతం అరడజను నిమ్మకాయలు రూ.40 పలుకుతున్నాయి. అలాగే హోల్సేల్ మార్కెట్లో నెల రోజుల క్రితం రూ.2 వేల ధర పలికిన పెద్ద సైజు నిమ్మకాయలు.. ప్రస్తుతం రూ.7 వేలకు పైగా పలుకుతోంది. అయితే ఈ ఏడాది కురిసిన వర్షాల కారణంగా నిమ్మకాయల కరువు ఏర్పడడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.