హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నడిపే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు స్పైస్జెట్ సంస్థ ప్రకటించింది. 2 నెలల క్రితం వారానికి 3 సర్వీసుల చొప్పున స్పైస్జెట్ ఈ విమాన సర్వీసును ప్రారంభించింది. అయితే తగినంత డిమాండ్ లేకపోవడంతో సర్వీసును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వీసును రద్దు చేసినప్పటికీ చెన్నై-అయోధ్యల మధ్య విమాన సర్వీసును యథాతథంగా నడుపుతున్నట్లు పేర్కొంది.