ఆగి ఉన్న కారులో చెలరేగిన మంటలు

10204చూసినవారు
హైదరాబాద్ ఆరాంఘర్ వద్ద బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆరాంఘర్ బస్ స్టాప్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎవరో కావాలనే కారుకు నిప్పు పెట్టారని, స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్