రేపు ఢిల్లీకి రేవంత్, భట్టి విక్రమార్క

559చూసినవారు
రేపు ఢిల్లీకి రేవంత్, భట్టి విక్రమార్క
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీలు రేపు(ఆదివారం) హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో వీరు పాల్గొననున్నారు. మిగిలిన నాలుగు లోక్సభ స్థానాల అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రెండు రోజులుగా నియోజకవర్గాల నేతల అభిప్రాయాలు స్క్రీనింగ్ కమిటీ సేకరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్