ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలి...

62చూసినవారు
స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శాలిబండ డివిజన్ పరిధిలోని కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ ముస్తఫా అలీ ముజఫర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రానున్న 5 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మొక్కలు పెంచడంతో పాటు ఇంటి పరిసరాలను, కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్