ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు

72చూసినవారు
ఇవాళ, రేపు వరుస సెలవులు కావడంతో ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది. ఎల్బీనగర్, మియాపూర్ మార్గంలో రైళ్లన్ని కిటకిటలాడుతున్నాయి. దీంతో ఆ మార్గంలో రద్దీకి తగ్గట్లుగా మెట్రో యాజమాన్యం చర్యలు చేపట్టింది. 70 అడుగుల సప్తముఖ మహా శక్తి గణపతి మంగళవారం నాడు గంగమ్మ ఒడికి చేరనున్నారు. దీంతో భక్తులు భారీగా వచ్చి దర్శించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్