ఖైరతాబాద్ డివిజన్ పరిధిలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు నాటడం తప్పనిసరి అని తెలిపారు. ప్రతి కాలనీలో విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.