రీల్స్ కోసం స్టంట్లు చేస్తే కఠిన చర్యలు: డీజీపీ

67చూసినవారు
రీల్స్ కోసం స్టంట్లు చేస్తే కఠిన చర్యలు: డీజీపీ
సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందేందుకు రహదారులపై ఇష్టమొచ్చినట్టు స్టంట్లు చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ శనివారం హెచ్చరించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. రీల్స్ మోజులో పడి కుటుంబాలను నాశనం చేసుకోవద్దని, ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కొందరు చేసిన స్టంట్లకు సంబంధించిన ఫొటోలను జత చేస్తూ ఎక్స్ వేదికగా డీజీపీ ఈ సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్